తెలంగాణ
Ponguleti: ప్రతి వ్యక్తికి ఒక చట్టం లా ఉండేదే భూ భారతి చట్టం

Ponguleti: జగిత్యాల జిల్లా బుగ్గారంలో భూ భారతి సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ పాల్గొన్నారు. దేశంలోనే భూ భారతి చట్టం రోల్ మోడల్గా కాబోతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
ప్రతి వ్యక్తికి ఒక చట్టం లా ఉండేదే భూ భారతి చట్టం అని అన్నారు. ప్రజల వద్దకు వెళ్లి భూ సమస్యలను పరిష్కారించడమే భూ లక్ష్యమన్నారు. అధికారులు తప్పు చేస్తే శిక్షిస్తామన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదోడి రాజ్యమన్నారు.