Rekha Gupta: నేడు ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తా ప్రమాణం

Rekha Gupta: కాసేపట్లో ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తా ప్రమాణం చేయనున్నారు. రాంలీలా మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారోత్సవం జరుగనుంది. డిప్యూటీ సీఎంగా పర్వేశ్ వర్మ మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం కన్పిస్తోంది. కేబినెట్లోకి ఆశిష్ సూద్, సిస్రా, కపిల్మిశ్రా, పంకజ్ సింగ్, రవీంద్ర రాజ్ను తీసుకున్నట్లు సమాచారం. మధ్యాహ్నం 12గంటల 35నిమిషాలకి కొత్త సీఎంగా ప్రమాణస్వీకారోత్సవం చేయనున్నారు రేఖా గుప్తా.
ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు హాజరుకానున్నారు. ఏన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొననున్నారు. 30వేల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. రాంలీలాలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రత ఉంది. ఇక ఢీల్లీ తొమ్మిదో ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా ప్రమాణం చేయనుండగా ఢిల్లీ నాలుగో మహిళా ముఖ్యమంత్రి రేఖాగుప్తా విధులు నిర్వహించనున్నారు.