ఆంధ్ర ప్రదేశ్

Kadapa: నేడే ఉమ్మడి కడప జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎన్నిక

Kadapa: ఉమ్మడి కడప జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఉదయం 11గంటలకు జిల్లా సర్వసభ్య సమావేశం ప్రత్యేకంగా భేటీ కానుంది. ఈ సమావేశంలో ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ జరగనుంది. మొత్తం 50ZPTC స్థానాలకు ఒంటిమిట్ట, పులివెందుల ZPTC స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అయితే 48 ZPTC స్థానాలకుగాను, 50శాతానికిపైగా సభ్యుల మద్దుతు ఉన్న వారే జడ్పీ ఛైర్మన్‌గా ఎన్నికవుతారు.

ఛైర్మన్ ఎన్నికైన వెంటనే ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండనుంది. మరోవైపు ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు జడ్పీ సీఈవో ఓబులమ్మ. కాగా ZPTC సభ్యులను వైసీపీ నేతలు కడపకు తరలించారు. వీరంతా రాత్రి ఒక ప్రైవేట్ హోటల్లో బస చేసినట్లు తెలుస్తుంది. ఎన్నిక రోజు జడ్పీ మీటింగ్ హాల్‌కు ఈ ZPTC సభ్యులను వైసీపీ నేతలు తీసుకురానున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button