తెలంగాణ
నేటి నుంచి తెలంగాణలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. రాజీవ్ యువ వికాసం పేరుతో అమలు చేయనున్న ఈ పథకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. నిరుద్యోగులునేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.
ఈ పథకం కోసం రూ.6వేల కోట్లు కేటాయిస్తామని, రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి. వచ్చే నెల 5 వరకు అప్లే చేసుకునే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు ఈ దరఖాస్తులను పరిశీలించి జిల్లాల కలెక్టర్లు అర్హులను ఎంపిక చేయనున్నారు.