తెలంగాణ
నాగార్జునసాగర్ ప్రాజెక్టులో సంతరించుకున్న జలకళ

Nagarjuna Sagar: అన్నదాతలచేత ఆధునిక దేవాలయంగా కీర్తింపబడుతున్న నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ జలకలను సంతరించుకుంది. ఎగువ ప్రాంతంలో ఉన్న శ్రీశైలం జలాశయం నుంచి భారీగా నీరు వచ్చి చేరుతుంది. దీంతో సాగర్ నిండుకుండను తలపిస్తుంది.
నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం 590 అడుగులకు గాను 582 అడుగులకు నీరు వచ్చి చేరింది. 312 TMC ల నీటి సామర్థం గల ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 292 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రం నుంచి జలవిద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.



