ఆంధ్ర ప్రదేశ్
Srisailam Temple: శ్రీశైలంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు.. తరలివస్తున్న భక్తులు

Srisailam Temple: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైల క్షేత్రం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మన రాష్ట్రం నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి శ్రీగిరి క్షేత్రానికి భక్తులు చేరుకుని భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనం చేసుకుంటున్నారు. వేకువజాముండే పాతాళగంగలో భక్తులు స్నానమాచరిస్తున్నారు.