ఆంధ్ర ప్రదేశ్
ఏపీ ప్రభుత్వానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కృతజ్ఞతలు

తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను పరిగణలోకి తీసుకుంటామని ఆంధ్ర ప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ హర్షం వ్యక్తం చేశారు.
తిరుమల శ్రీవారి దర్శనాలకు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు అనుమతించడంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి, టీటీడీ ఛైర్మన్కు స్పీకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.