తెలంగాణ

Hyderabad: హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణలో కీలక ఘట్టం

Hyderabad: ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణలో కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. ప్రభావిత ఆస్తుల యజమానులకు ఈరోజు చెక్కులు పంపిణీ చేయనున్నారు. చెక్కుల పంపిణీతో రెండో దశ మెట్రో పనులు ప్రారంభించడానికి లైన్ క్లియర్ క్లియర్ కానుంది. కారిడార్-6లో ఎంజీబీఎస్ – చంద్రాయణ్ గుట్ట మార్గంలో 1100 ప్రభావిత ఆస్తులు ఉన్నాయి.

పెద్ద ఎత్తున వాటి యజమానులు స్వచ్ఛందంగా.. తమ స్థలాలను మెట్రో రైలు నిర్మాణం కోసం ఇవ్వడానికి.. ముందుకు వస్తున్నారని HAML ఎండీ రెడ్డి తెలిపారు. ఇంతవరకు 169 మంది వారి అనుమతి పత్రాలను ఇచ్చారని ఆయన తెలిపారు. వాటిలో 40కి పైగా ఆస్తుల యాజమాన్యానికి సంబంధించిన ధ్రువీకరణ పూర్తి చేశారు.

తొలి దశలో 40కి పైగా ఆస్తుల యజమానులకు ఈరోజు చెక్కులు పంపిణీ చేయనున్నారు. ప్రభావిత ఆస్తులకు చదరపు గజానికి 81 వేలు ఇవ్వనుంది ప్రభుత్వం. దీనితో పాటు రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ చట్టం ప్రకారం, పునరావాస పరిహారం, తొలగించే నిర్మాణాలకు కూడా నష్టపరిహారాన్ని.. అర్హులైన ఆస్తుల యజమానికి ఇవ్వడం జరుగుతుందని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button