Tirumala: తిరుమల అలిపిరి నడక మార్గంలో ఆంక్షలు

Tirumala: తిరుమల అలిపిరి నడక మార్గంలో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. చిరుత సంచారంతో మరోసారి టీటీడీ అలర్ట్ అయ్యింది. సాయంత్రం సమయంలో భక్తులను గుంపులు గుంపులుగా కొండపైకి అనుమతి ఇస్తున్నారు. ముఖ్యంగా గుంపులో 70 నుంచి 100 మంది ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. 12ఏళ్ల లోపు చిన్నపిల్లలను.. మధ్యాహ్నం 2గంటల తర్వాత కొండపైకి అనుమతించడం లేదు టీటీడీ. ఇక రాత్రి 9గంటల 30నిమిషాలకు అలిపిరి నడకదారిని కూడా టీటీడీ మూసివేస్తోంది.
తిరుమల అలిపిరి మెట్లమార్గం సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. వెంటనే సమాచారం అందుకున్న టీటీడీ ఫారెస్ట్ విజిలెన్స్ సిబ్బంది అలెర్ట్ అయ్యారు. ముగ్గుబావి సమీప అటవీప్రాంతం పొదల్లో చిరుత సంచరించింది. దీంతో సిబ్బంది గట్టిగా శబ్దాలు చేయడంతో అడవిలోకి వెళ్లింది చిరుతపులి. సాయంత్రం 6గంటల తరువాత 7వ మైలు నుండి నరసింహస్వామి ఆలయం వరకు గుంపులుగుంపులుగా భక్తులను పంపుతున్నారు. నిరంతర నిఘా చేపట్టారు.