ఆంధ్ర ప్రదేశ్

Chandrababu: దావోస్‌ సదస్సుకు సీఎం చంద్రబాబు బృందం…

Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు బృందం దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 20 నుంచి 4 రోజుల పాటు దావోస్​లో పర్యటించనుంది చంద్రబాబు టీం. స్విట్జర్లాండ్​లోని దావోస్​లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 సదస్సుకు సీఎం నేతృత్వంలోని ఏపీ టీమ్ హాజరు కానుంది. ఈ మేరకు ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలియచేసింది. ఈ మేరకు ఏపీ నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు.. ప్రతినిధుల బృందం హాజరయ్యేందుకు అవసరమైన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

దావోస్‌లో జరిగే సదస్సుకు ముఖ్మయంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, పలువురు అధికారులు హాజరవుతారు. సీఎం టీమ్‌తో పాటుగా పరిశ్రమలు, ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు అధికారులు కూడా దావోస్ సదస్సుకు వెళతారు. దావోస్ సదస్సులో రాష్ట్రంలోని వనరులు, పెట్టుబడి అవకాశాలను సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అండ్ టీమ్ వివరించనుంది.

ఏపీ ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని.. దీని కోసం వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరంను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మౌలిక రంగం, వ్యవసాయం, తయారీ, ఐటీ రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకోవాలని భావిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button