ఆంధ్ర ప్రదేశ్
Pawan Kalyan: పహల్గామ్లో ఉగ్రదాడి కలచి వేసింది

Pawan Kalyan: పహల్గామ్లో ఉగ్రదాడి కలచి వేసిందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఉగ్రవాదుల తూటాలకు దేశమంతా కన్నీళ్లు పెడుతుందన్నారు. విశాఖలో రిటైర్డ్ ఎంప్లాయి, కావలిలో యువకుడు చనిపోవడం బాధాకరమన్నారు . మంగళగిరిలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పవన్ పహల్గామ్ మృతులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు.
జాతీయ సమైక్యతను పెంపొందించేలా అన్ని పంచాయతీల్లో జాతీయ సమగ్రతా ప్రాంగణాలుండాలని చెప్పారు. 13వేల 326 పంచాయతీల్లో జాతీయ సమగ్రతా ప్రాంగణాలు, స్థూపాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పనులు చేసే వారిని కూలీలు అనొద్దని పవన్ కల్యాణ్ సూచించారు. నరేగా శ్రామికులు, లేదా గ్రామీణ వికాస శ్రామికులు అనాలని సూచించారు.