ఆంధ్ర ప్రదేశ్
Kadapa: బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు

Kadapa: కడప జిల్లా గుడిపాడు వద్ద బస్సు బోల్తా కొట్టింది. డివైడర్ను ఢీకొట్టిన జగన్ ట్రావెల్స్ బస్సు.. పల్టీ కొట్టింది. ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తర లించారు.
హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.