తెలంగాణ
వేములవాడ రాజన్న గోశాలలో ఘోరం.. ఎనిమిది కోడెలు మృతి

సిరిసిల్లా జిల్లా వేములవాడ రాజన్న గోశాలలో ఘోరం చోటుచేసుకుంది. తిప్పాపురంలో ఎనిమిది కోడెలు మృతి చెందాయి. గుట్టు చప్పుడు కాకుండా మూలవాగులో కోడెలను పాతి పెట్టారు. ప్రస్తుతం గోశాలలో 1,200 కోడెలు ఉండగా, సరైన నిర్వహణ లేక కోడెలు చనిపోతున్నాయంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోడెలు చనిపోతున్నా ఆలయ ఈవో కానీ సిబ్బంది కానీ పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆలయ అధికారుల తీరుపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో కూడా సరైన ఏర్పాట్లు లేక కోడెలు మృతి చెందాయని చెబుతున్నారు. కోడెలతో ఆలయానికి కోట్ల ఆదాయం ఉన్నా సంరక్షణలో విఫలం అవుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.