తెలంగాణ
KTR: ప్రధాని నరేంద్ర మోదీకి కేటీఆర్ లేఖ

KTR: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక విజ్ఞప్తి చేశారు. పర్యావరణంపై, ప్రధానిగా తన బాధ్యతలపై చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయం ఇది అని లేఖలో పేర్కొన్నారు. కంచ గచ్చిబౌలి భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ చేపట్టి కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలని సూచించారు.
హెచ్సీయూ కంచ గచ్చిబౌలిలో జరిగిన విధ్వంసం విషయంలో తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని లేఖలో పేర్కొన్నారు. రేవంత్ చేసిన విధ్వంసంపై ప్రధానమంత్రి మాట్లాడింది కేవలం బూటకం కాకపోతే చర్యలు తీసుకోవాలని కేటీఆర్ పేర్కొన్నారు.