తెలంగాణ
సిగాచి యాజమాన్యంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్

మరోవైపు సిగాచి యాజమాన్యంపై తెలంగాణ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఇప్పటికి కూడా సిగాచి పరిశ్రమ ఎండీ ఘటనస్థలానికి చేరుకోకపోవడంతో సీరియస్గా ఉంది. నిన్న సిగాచి పరిశ్రమలో పేలుడు ప్రాంతాన్ని సీఎం రేవంత్ పరిశీలించారు.
అధికారులకు పలు సూచనలు చేశారు. పరిశ్రమ శాఖ అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ సిగాచి యాజమా న్యానికి వార్నింగ్ ఇచ్చారు. అయినా కూడా సిగాచి యాజమాన్యం స్పందించకపోవడంతో ప్రభుత్వం చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తుంది.



