News

Kancha Ilaiah: ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి ఏమైనా చ‌దువు వ‌చ్చా… మ‌రోసారి కంచె ఐల‌య్య‌ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

Kancha Ilaiah: వరంగల్‌లో మరోసారి ప్రొఫెసర్ కంచె ఐలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయ‌న తిరుమ‌ల వెంక‌న్న‌, ప‌ద్మావతి అమ్మ‌వారిపై చేసిన వ్యాఖ్య‌లు నెట్టింట దుమారం రేపుతున్నాయి. మ‌హ‌బుబాబాద్ జిల్లా గూడురులో దొడ్డి కొమరయ్య విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్యక్రమంలో మ‌హిళా విశ్వ‌విద్యాల‌యానికి తెలంగాణ ప్ర‌భుత్వం చాక‌లి ఐల‌మ్మ పేరు పెట్ట‌డం త‌ప్పేమీ కాద‌ని కంచె ఐలయ్య వ్యాఖ్యలు చేశారు. ఐల‌మ్మ బ‌ట్ట‌లు ఉతికి స‌మాజాన్ని శుద్ధి చేశార‌ని ఐల‌య్య పేర్కొన్నారు.

అదే స‌మ‌యంలో యూనివ‌ర్సిటీల‌కు దేవుళ్ల పేర్లు పెట్ట‌డం ఎందుక‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ క్ర‌మంలో తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర స్వామి, ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి ఏమైనా చ‌దువు వ‌చ్చా? అని వ్యాఖ్యానించారు. దాంతో ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు స్వామివారి భ‌క్తులు భ‌గ్గుమంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button