ఆంధ్ర ప్రదేశ్
AP News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రిజిస్ట్రేషన్ విలువల పెంపు

AP News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చేనెల ఒకటి నుంచి రిజిస్ట్రేషన్ విలువలను పెంచనుంది. ఈ మేరకు మంత్రి అనగాని ప్రసాద్ ప్రకటించారు. రిజిస్ట్రేషన్ల పెంపుతోపాటు హేతుబద్దీకరణ చేపడతామన్నారు.
అదేవిధంగా అమరావతి 29 గ్రామాల్లో భూమి విలువ పెంచడం లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే భోగాపురం పరిసర ప్రాంతాల్లోనూ పెరిగే అవకాశం ఉందన్నారు మంత్రి అనగాని. గతంలో జరిగిన అక్రమాలను సరిదిద్దుతామన్న మంత్రి అనగాని సత్యప్రసాద్.. తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు.