జాతియం
PM Modi: దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా.. ప్రతీకారం తీర్చుకుంటాం

PM Modi: పహల్గామ్లో ఉగ్రదాడి ఘటనపై ప్రధాని మోదీ సీరియస్ అయ్యారు. దాడికి పాల్పడ్డ ప్రతి ఒక్కడిని వేటాడి శిక్షిస్తామని తేల్చి చెప్పారు. దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా ప్రతీకారం తీర్చుకుంటామని కుండబద్ధలు కొట్టారు మోదీ. ఉగ్రవాదులను కలలో కూడా ఊహించని రీతిలో శిక్షిస్తామన్నారు. ఇది పర్యాటకులపై కాదు. ఇది దేశంపై జరిగిన దాడిగా చెప్పారు మోదీ.
పహల్గామ్లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారని అయితే ఇప్పుడు ఉగ్రనేతలను కూడా అసలు విడిచిపెట్టమని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపే సమయం వచ్చిందన్నారు. ఇక ప్రపంచం కూడా ప్రతీకారం ఎలా ఉంటుందో చూడబోతోందన్నారు ప్రధాని మోదీ.