అంతర్జాతీయం

Bangladesh-China: బంగ్లాదేశ్ ఓవరాక్షన్.. ఇండియాపై యూనస్ అక్కసు

Bangladesh-China: నవ్విపోదురు గాక నాకే సిగ్గు అంటోంది బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం. ప్రజలతో ఎన్నుకోలేదు. ప్రజల ద్వారా గెలవలేదు. కానీ ఇండియాపై మాత్రం అక్కసు ప్రదర్శిస్తూనే ఉంది. చిన్న పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి, తద్వారా ఆర్థిక రంగ నిపుణుడన్న పేరు సంపాదించి నోబుల్ అవార్డు గెలుచుకున్న మహ్మద్ యూనస్ బుద్ధేంటో ఆయన పగ్గాలు చేపట్టిన నాటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం.

ఇండియాకు వ్యతిరేకంగా ఓవైపు పాకిస్తాన్ మరోవైపు చైనాలను ఉసిగొల్పి తన పీఠం కాపాడుకోవాలని చూస్తున్నాడు. తాజాగా చైనాకు వెళ్లి బంగ్లా పాలకుడు వక్ర బుద్ధిని చాటుకున్నాడు. ఇండియాపై వ్యతిరేకతతో చెలరేగిపోయాడు. ఇండియా భిక్షతో స్వాతంత్ర్యం సంపాదించిన దేశంలో ఉన్న ఒక పెద్ద మనిషి సాగిస్తున్న దౌత్య అరాచకం ప్రపంచంలో మరెవరికీ సాధ్యం కాదంటో నిజమేనని అంగీకరించాల్సిందే.

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు ముహమ్మద్ యూనస్, భారతదేశ ఈశాన్య రాష్ట్రాలను బెదిరిస్తూ మరోసారి వార్తల్లో నిలిచాడు. చైనాకు రెడ్ కార్పెట్ పలికి, ఇండియాకు ఎర్రజెండా చూపించాడు. గత వారం బీజింగ్‌లో నాలుగు రోజుల పర్యటన చేసిన యూనస్ బంగ్లాదేశ్ లో పలు ప్రాజెక్టులను చేపట్టాల్సిందిగా దగా కోర్ చైనాను కోరుకున్నాడు. బంగ్లాదేశ్ -చైనా ఏమైనా చేసుకుంటాయ్. మనకు ఆ విషయం అక్కర్లేదు. కానీ ఇండియాను కెలికి చలి కాచుకోవాలనుకోవడంతో ఆ మొత్తం వ్యవహారంపై అగ్గిరాజుకుంటోంది.

నార్త్ ఇస్ట్రన్ స్టేట్స్ లాండ్ లాక్డ్ స్టేట్స్ అని సముద్రమే లేదని, ఏటు చూసినా భూభాగమేనని తమకు మాత్రమే అంటే బంగ్లాదేశ్‌‌కు ఒక్కదానికే సముద్రమార్గముంటూ గొప్పలు పోయాడు యూనస్. ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్ గా ఉన్నందున వాటిని పరోక్షంగా అణచివేయొచ్చని ఈ ప్రాంతంలో చైనా విస్తరించొచ్చేందుకు తాము వెల్కమ్ పలుకుతామన్నాడు.

ఏడు రాష్ట్రాలను సముద్ర మార్గం ద్వారా చేరుకోలేమన్న ఆయన సముద్రజాలలన్నింటికీ తామే రక్షకులమని కలరింగ్ ఇచ్చాడు. ఇండియా ప్రమేయం అక్కడ ఉండదని, ఇక బంగ్లాదేశ్ ఆధీనంలోని సముద్ర జలాల్లో చైనా ఏమైనా చేసుకోవచ్చంటూ అక్కడి పాలకులను రారమ్మంటూ స్వాగతం పలికాడు.

ఈశాన్య రాష్ట్రాలపై ముహమ్మద్ యూనస్ వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మండిపడ్డాడు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతావా యూనస్ అంటూ గయ్యమన్నాడు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రమాదకరమని… ఇండియాను లైట్ తీసుకుంటే తిప్పలు తప్పవన్నాడు. ఇకనైనా ఇండియా బంగ్లాదేశ్‌కు చెక్ పెట్టేలా వ్యవహరించాలన్నాడు. చికెన్స్ నెక్ కారిడార్‌ను తక్షణం డెవలప్ చేయాలన్నాడు. చికెన్స్ నెక్, పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలోని ఒక భూభాగం. ఇది ఈశాన్యాన్ని భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలుపుతుంది. నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ ఈ ప్రాంతాన్ని చుట్టూ ఉంటాయి.

బంగ్లా పాలకుడి వ్యాఖ్యల తర్వాతైనా సరే చికెన్స్ నెక్ కారిడార్ కింద బలమైన రైల్వే, రోడ్డు నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేయడం అత్యవసరమన్నారు హిమంత. చికెన్స్ నెక్‌ను సమర్థవంతంగా దాటేసేలా ఈశాన్యాన్ని దేశంలోని ఇతర భూభాగానికి అనుసంధానించాలన్నాడు. ప్రత్యామ్నాయ రహదారి మార్గాలను అన్వేషించాలని హిమంత అభిప్రాయపడ్డారు.

ఇంజనీరింగ్ సవాళ్లు ఎన్ని ఉన్నప్పటికీ దృఢ సంకల్పం, కొత్త టెక్నాలజీతో సాధించి బంగ్లాదేశ్‌కు వెన్నులో వణుకు పుట్టించాలన్నాడు. యూనిస్ రెచ్చగొట్టే ప్రకటనలను తేలికగా తీసుకోకూడదన్నాడు. ఢాకా విధానం ఈశాన్య ప్రాంతాలకు ప్రమాదకరమని, దీనిపై కేంద్ర విధానమేంటో చెప్పాలని కాంగ్రెస్‌ నేత పవన్ ఖేరా దుయ్యబట్టారు.

ఈశాన్యాన్ని దేశంలోని మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించే మరింత బలమైన రైలు, రోడ్డు నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేయడం అత్యవసరం అని అన్నారు. ఈశాన్య భారతదేశంలోని ఏడు సోదర రాష్ట్రాలను ల్యాండ్ లాక్డ్‌గా పేర్కొంటూ బంగ్లాదేశ్‌ను సముద్రానికి సంరక్షకుడంటూ యూనిస్ ప్రకటన అభ్యంతరకరమైనది మండిపడ్డారు.

యూనస్ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ సోషల్ మీడియా X వేదికగా విరుచుకుపడ్డాడు. అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారో మీకైనా అర్థమవుతుందా అని ప్రశ్నించాడు. ఇండియాలోని ఏడు రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అని బహిరంగ కామెంట్స్ చేయడం అసరమేంటన్నాడు.

త్రిపు నేత మాత్రం మరో అడుగు ముందుకేసి బంగ్లాదేశ్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. త్రిపురలో తిప్రా మోతా పార్టీకి నాయకత్వం వహిస్తున్న ప్రద్యోత్ మాణిక్య తీవ్ర వ్యాఖ్య చేశాడు. ఒకప్పుడు చిట్టగాంగ్‌ను పాలించిన మన స్వదేశీ ప్రజలకు మద్దతు ఇవ్వడం ద్వారా భారతదేశం సముద్రంలోకి ఒక మార్గాన్ని ఏర్పరచుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు.

తద్వారా మనం ఇకపై కృతజ్ఞత లేని పాలనపై ఆధారపడకూడదన్నాడు. భారతదేశం చేసిన అతిపెద్ద తప్పు ఏమిటంటే, 1947లో అక్కడ నివసిస్తున్న కొండప్రాంత ప్రజలు భారత యూనియన్‌లో భాగం కావాలని కోరుకుంటున్నప్పటికీ, ఓడరేవును వదులుకోవడమన్నాడు. యూనస్ తనును తాను సముద్ర సంరక్షకుడినని అనుకుంటున్నాడని… కానీ 85 ఏళ్ల వయసులో స్టాప్ గ్యాప్ పాలకుడన్న విషయాన్ని మరువొద్దన్నాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button