జాతియం

ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ బోర్డర్‌లో హై టెన్షన్

ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ బోర్డర్‌లో హై టెన్షన్ నెలకొంది. ఆపరేషన్ కర్రెగుట్ట కొనసాగుతుంది. 24 వేల మందికి పైగా భద్రత బలగాలతో కూంబింగ్ కొనసాగుతుంది. హెలికాఫ్టర్‌, డ్రోన్స్ ద్వారా కర్రెగుట్టను బలగాలు జల్లెడ పడుతున్నాయి. కర్రెగుట్టల్లో అడుగడుగునా మందుపాతరలు, ఐఈడీలు, బాటిల్ బాంబులను నిర్వీర్యం చేస్తూ కూంబింగ్ చేపడుతున్నారు. ఇప్పటికే బలగాలు కర్రెగుట్టలో భారీగా బంకర్లను గుర్తించారు.

వెంకటాపురం ఏజెన్సీలో హై టెన్షన్ కొనసాగుతుంది. బాంబుల శబ్దాలు, తుపాకుల మోతలతో కర్రెగుట్ట దద్దరిల్లుతుంది. హెలికాఫ్టర్లతో అధికారులు అడవిని జల్లెడ పడుతున్నారు. ఆపరేషన్ కగార్‌లో భాగంగా 9 రోజులుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది.

డ్రోన్ల సాయంతో అడవిని జల్లెడ పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఏజెన్సీ ప్రజలు భయాందోళనకు గురైతున్నారు. భారీ అంతర్గత యుద్ధానికి కేంద్రం నాంది పలకనుందా అనే ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. కేంద్రం నిర్ణయంపై రాజకీయ పార్టీలు సైతం తప్పుపడుతున్నాయి.

ఎన్‌కౌంటర్ల ద్వారా మావోయిస్టు రహిత భారత్‌‌గా సాధ్యమా శాంతి చర్చల ద్వారా లక్ష్యం సాధ్యం కాదా అని ప్రతిపక్షాలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి. అమాయక ఆదివాసీ గిరిజనులను ఎన్‌కౌంటర్ల పేరుతో కాల్చి చంపుతున్నారని ప్రజా సంఘాలు, మావోయిస్టులు, పలు రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నప్పటికి కేంద్రం మొండిగా వ్యవహరిస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button