ఆంధ్ర ప్రదేశ్
AP Assembly: ఏపీ మండలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం

AP Assembly: ఏపీ శాసనమండలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఉచిత ఇసుక విధానంపై వైసీపీ ప్రశ్నలు సంధించింది. ఉచిత ఇసక విధానంలో నిబంధనలు పాటించలేదని వైసీపీ నేత బొత్స వ్యాఖ్యానించారు. యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేస్తున్నారని వాపోయారు. ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పిన కూటమి ధరలు తగ్గించలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న ధరలే ఉన్నాయన్నారు.
అయితే వైసీపీ సభ్యల ప్రశ్నలకు ధీటుగా మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిచ్చారు. ఉచిత ఇసుక విధానంపై వైసీపీ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు కొళ్లు. గతంలో పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరిగిందన్నారు. కూటమి పాలనలో ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చామని లోడింగ్, ట్రాన్స్ పోర్టు ఛార్జీలనే తీసుకుంటున్నామన్నారు. పారదర్శకంగా ఇసుక విధానం అమలు చేస్తున్నామని వెల్లడించారు కొల్లు.