జాతియం
West Bengal: గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురి మృతి

West Bengal: పశ్చిమ్ బెంగాల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు.
దక్షిణ 24పరగణాల జిల్లాలోని పథార్ ప్రతిమా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పలువురు వ్యక్తులు ఈ ఇంటిని బాణాసంచా తయారీ కేంద్రంగా ఉపయోగిస్తున్నారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించగా.. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటాన స్థలానికి చేరుకుని మంటలు అర్పేందుకు ప్రయత్నించారు.
ఆ ఇంట్లో మొత్తం 11 మంది ఉండగా అందులో ఏడుగురు మృతి చెందారు. మిగిలిన నలుగురి ఆచూకి తెలయరాలేదు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. సిలిండర్ పేలుడు కారణంగానే మంటలు వ్యాపించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.