తెలంగాణ
Konda Vishweshwar Reddy: టర్కీ వెళ్లే వారిని బహిష్కరించాలి

Konda Vishweshwar Reddy: టర్కీపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. సెలవులకు టర్కీకి వెళ్లడం మానేయాలన్నారు కొండా. టర్కీకి వెళ్లే వారిని బహిష్కరించాలన్నారు. 2022లో 2.3లక్షలకు పైగా భారతీయ పర్యాటకులు. 23 వందల కోట్లకు పైగా ఖర్చు చేసి టర్కీని సందర్శించారని తెలిపారు.
భూకంపంతో టర్కీ అతలాకుతలం అయినప్పుడు భారత్ సహాయం అందించిందన్నారు కొండా. ఇప్పుడు టర్కీ భారత పౌరులపై దాడి చేయడానికి పాకిస్తాన్కు డజన్ల కొద్దీ డ్రోన్ లను సరఫరా చేస్తుందని ఆరోపించారు.