తెలంగాణ
BRS Party: ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు

BRS Party: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన MLAలపై అనర్హత విషయంలో సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ రెండు పిటిషన్లు దాఖలు చేసింది. 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన 9 నెలలు అవుతున్నా.. స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని బీఆర్ఎస్ పేర్కొంది.
దానం నాగేందర్ , తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి కు వ్యతిరేకంగా SLPదాఖలు చేసింది. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, డాక్టర్ సంజయ్, అరికెపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, మహిపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది.