ఆంధ్ర ప్రదేశ్
మళ్లీ విశాఖకు లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ సంస్థ

విశాఖకు లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ సంస్థ మళ్లీ తిరిగి వచ్చింది. జగన్ హయాంలో వెనక్కి వెళ్లిపోయిన లులూ గ్రూప్ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి వచ్చింది. జనవరిలో చంద్రబాబును కలిశారు లులూ ఛైర్మన్. ఇందులో భాగంగా గతంలో కేటాయించిన 13.43 ఎకరాలు తిరిగి కేటాయిస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం.
అటు లులూ సంస్ధ ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఏపీఐఐసీకి అప్పగించింది ప్రభుత్వం. ప్రభుత్వం ఇచ్చిన 13.43 ఎకరాల్లో చిల్డ్రన్స్ ఎమ్యూజ్మెంట్ పార్కు, పుడ్కోర్టు 8 స్క్రీన్లతో ఐమ్యాక్స్ మల్లీప్లెక్స్లు నిర్మించనుంది లులూ సంస్థ.