Bharat Summit 2025: హైదరాబాద్ లో భారత్ సమ్మిట్ ప్రారంభం

Bharat Summit: HICC వేదికగా భారత్ సమ్మిట్ ప్రారంభమైంది. పెట్టుబడులు, న్యాయం, ప్రపంచ శాంతి, అహింస లక్ష్యంగా భారత్ సమ్మిట్ కొనసాగుతోంది. తొలుత విదేశీ ప్రతి నిధులకు తెలంగాణ మంత్రులు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే విధంగా కాంగ్రెస్ నేతలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు ఈ సమ్మిట్ కొనసాగనుంది. సమ్మిట్కు వందకు పైగా దేశాల ప్రతినిధులు వచ్చారు. 450 మందికిపైగా డెలిగేట్స్ పాల్గొన్నారు. సమ్మిట్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ఎంపీ ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, ఇతర రాజకీయనేతలు హాజరుకానున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమం భవిష్యత్ ప్రణాళికల్ని ఈ సమ్మిట్లో వివరించనున్నారు. అయితే.. ఈ సమ్మిట్ను సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రపంచ శాంతి, అహింస, న్యాయం.. పెట్టుబడులే లక్ష్యంగా భారత్ సమ్మిట్ నిర్వహణ కొనసాగనుంది. ఎకనమిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, సోషల్ జస్టిస్, జెండర్ జెస్టిస్, యూత్ జస్టిస్, ఎకలాజికల్ జస్టిస్, పీస్ జస్టిస్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ విధానాల ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధ్యమంటున్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్.