తెలంగాణ
BRS Party: ధూం ధాం పాటలతో మార్మోగుతున్న సభా ప్రాంగణం

BRS Party: బీఆర్ఎస్ 25 ఏండ్ల ఆవిర్భావ పండుగ అట్టహాసంగా కొనసాగుతోంది. సభా ప్రాంగణంలో కళాకారుల ఆటపాటలకు జనం ఉరకలేస్తూ… ఉత్సాహంతో డ్యాన్స్లు చేస్తున్నారు. తెలంగాణ పాటలతో గులాబీ సైనికులు, ప్రజలు ఊగిపోతున్నారు. గులాబీ జెండాలను రెపరెపలాడిస్తూ.. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. సభా ప్రాంగణానికి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెలికాప్టర్.
ఇప్పటికే సభ వేదికపైకి చేరుకున్న కేటీఆర్, హరీష్ రావు, కవిత, బీఆర్ఎస్ నేతలు సభకు రాష్ట్రం నలుమూలల నుంచి హాజరైన ప్రజానీక. కేసీఆర్ ప్రసంగం కోసం ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ ఎల్కతుర్తి సభా ప్రాంగణానికి చేరుకోగానే.. జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాలతో సభా ప్రాంగణం దద్దరిల్లిపోయింది.