తెలంగాణ
School Holiday: నేడు తెలంగాణలో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు

School Holiday: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఈ నేపథ్యంలో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో దేశం గొప్ప నాయకుడిని కోల్పోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త, మహానాయకుడు, సంస్కరణ వాది అన్నింటికి మించి గొప్ప మానవతావాది అని సీఎం పేర్కొన్నారు.