ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: ఏపీలో ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

Chandrababu: ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే దిశగా పలువురు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఏపీ సీఎం. సమీక్ష సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి , డీజీపీ , ఆర్టీసీఎండీ, ఇతర ఉన్నతాధికారులు . ఉచిత బస్సు ప్రయాణం అంశంపై తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చించిన సీఎం.
ఉచిత బస్సు పథకం అమల్లో ఉన్న కర్ణాటక, దిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు మరింత మెరుగైన ఉచిత బస్ సర్వీస్ సేవలను అందించాలని అధికారులకు స్పష్టం చేసిన సూచించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దీనిపై సమగ్ర నివేదికను వీలైనంత త్వరగా ఇవ్వాలని తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉగాది నాటికి పథకం అమల్లోకి తెచ్చేలా పనులు వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు.