ఆంధ్ర ప్రదేశ్
Bus Fire: కొవ్వూరులో ట్రావెల్స్ బస్సు దగ్ధం

Bus Fire: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు హైవేపై బస్సు దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్తో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు ఎగసిపడ్డాయి. మంటలకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో 10 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
ఖమ్మం నుంచి RRR ట్రావెల్స్ బస్సు విశాఖ వెళ్తుండగా కొవ్వూరు గామన్ బ్రిడ్జి సమీపంలో హైవేపై ఈ ఘటన జరిగింది. బస్సు దగ్ధం కావడంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మంటల్ని ఫైర్ సిబ్బంది అదుపు చేశారు.



