తెలంగాణ
మంత్రుల సమక్షంలోనే గొడవ.. కౌశిక్రెడ్డిని బయటకు లాకెళ్లిన పోలీసులు

Padi Kaushik Reddy: కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశికర్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మధ్య ఘర్షణ జరిగింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా.. కౌశిక్ రెడ్డిని నిలదీశారు. ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావంటూ ప్రశ్నించారు. దీంతో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఆగ్రహానికి గురయ్యారు. పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ మధ్య వాగ్వాదం నెలకొంది. మైకులు లాక్కోవడానికి ప్రయత్నించారు. ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. కౌశిక్ రెడ్డిని పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు.