క్రీడలు

IPL 2025: IPL జట్లకు బీసీసీఐ అలర్ట్ జారీ

IPL 2025: ఐపీఎల్‎లో మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఐపీఎల్‎లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మ్యాచ్ ఫిక్సింగ్ ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్వయంగా బీసీసీఐ ధృవీకరించడం క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది . హైదరాబాద్‏కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు తెర వెనక ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు గుర్తించిన బీసీసీఐ ఈ మేరకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు, జట్టు మేనేజర్లు, కోచ్‎లు, ఆటగాళ్లు, అంపైర్లు, ఇతర సిబ్బందికి హెచ్చరికలు జారీ చేసింది.

గతంలో క్రికెట్ బెట్టింగ్స్, మ్యాచ్ ఫిక్సింగ్‎లు చేసిన అనుభవం ఆ వ్యాపారవేత్తకు ఉందని అతడికి పంటర్లు, బుకీలతో దగ్గరి సంబంధాలు ఉన్నాయని బీసీసీఐ అప్రమత్తం చేసింది. అతడు మళ్లీ యాక్టివ్ అయ్యాడని.. మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు జట్టు యజమానులు, ఆటగాళ్లను కలిసేందుకు ట్రై చేస్తున్నాడని అతడితో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

డబ్బే కాకుండా విలువైన వస్తువులు గిఫ్ట్‎లు ఎరగా వేస్తాడని కుటుంబ సభ్యులకు కూడా విలువైన గిఫ్టులు పంపి అతడి రొంపి లాగుతాడని హెచ్చరించింది. అతడితో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇప్పటికే అతడు ఎవరినైనా సంప్రదిస్తే తమకు సమాచారం అందించాలని సూచించింది. బుకీల వలలో చిక్కుకుని భవిష్యత్ పాడు చేసుకోవద్దని హెచ్చరించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button