జాతియం

Maha Kumbha Mela: మహాకుంభమేళాకు పోటెత్తున్న భక్తులు

Maha Kumbha Mela: మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తున్నారు. 20 రోజుల్లో 33 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. శనివారం ఒక్కరోజే 2.15 కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారు. నేడు వసంత పంచమి నేపథ్యంలో 4 నుంచి 6 కోట్ల మంది భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మౌని అమావాస్య సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన నేపథ్యంలో మరోసారి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యూపీ సర్కార్‌ ఏర్పాట్లు చేస్తోంది.

వసంత పంచమి సందర్భంగా త్రివేణీసంగమంలో అమృత స్నానాలకు భక్తులు పోటెత్తనున్న నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. మౌనీ అమావాస్య రోజున చోటుచేసుకున్న తొక్కిసలాట వంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఎటువంటి తప్పిదం జరగకుండా చూసేందుకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను రంగంలోకి దింపింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button