ఆంధ్ర ప్రదేశ్
Vijayawada : హిడ్మా డైరీ.. 27 మంది మావోయిస్టులు అరెస్ట్

Vijayawada: కృష్ణా జిల్లా పెనమలూరులో భారీగా మావోయిస్టులు అరెస్టయ్యారు. ఓ బిల్డింగ్లో తల దాచుకున్న 27 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విజయవాడలోని ఆక్టోపస్, టాస్క్ఫోర్స్ స్టేషన్లకు తరలించారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ ప్రాంతంలో దొరికిన హిడ్మా డైరీ ఆధారంగా 27 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు.



