తెలంగాణ

కర్రె గుట్టల్లో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్

Karre Gutta: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ బార్డర్‌లోని కర్రె గుట్టల్లో భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్‌‌‌‌‌ను కొనసాగిస్తున్నాయి. సన్ స్ట్రోక్ సాయుధ బలగాలకు సమస్యగా మారింది. ఎండల తీవ్రత, సరిపడా తాగునీరు లేకపోవడంతో అల్లాడిపోతున్నారు. ఇప్పటి వరకు 100కు పైగా జవాన్లు వడదెబ్బకు గురైతున్నారు. ప్రస్తుతం వారికి ట్రీట్‌‌‌‌మెంట్ అందిస్తున్నారు. వడదెబ్బకు ఇద్దరు జవాన్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ఇద్దరూ భద్రత ఇద్దరు సిబ్బంది వడదెబ్బకు గురి కావడంతో హెలికాప్టర్ల ద్వారా వెంకటాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంలో విలువైన వైద్యం కోసం వరంగల్ కి తరలించారు. గత 12 రోజులుగా కర్రెగుట్టపై భద్రత దళాలు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నప్పటికీ మావోయిస్టుల ఆచూకీ లభించడం లేదు. కర్రెగుట్టపై వరుస బాంబు దాడులతో భయానక వాతావరణం నెలకొంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button