ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: మహానాడు ప్రాంగణానికి సీఎం చంద్రబాబు

Chandrababu: కడప గడపలో టీడీపీ మహానాడు పండుగ ప్రారంభమైంది. మహానాడు ప్రాంగణానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకి టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. తొలుత ఎన్టీరామారావు విగ్రహానికి నివాళులర్పించారు చంద్రబాబు.
అనంతరం తెలుగుదేశం సాధించిన విజయాలపై ఫొటో ప్రదర్శనను తిలకించారు. కాసేపట్లో పార్టీ సంస్థాగత వ్యవహారాలపై ప్రధానంగా చర్చ జరుగనుంది. అదేవిధంగా రేపు రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధిపై చర్చించనున్నారు.