విశాఖ మేయర్ పీఠం కైవసం దిశగా కూటమి అడుగులు

Visakha: విశాఖ మేయర్ పీఠం కైవసం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కూటమి నేతలను వైసీపీ కార్పొరేటర్ బెహరా భాస్కరరావు కలవడంతో మరింత ప్రాధాన్యత సంతరించు కుంది. జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణతో బెహరా భాస్కరరావు భేటీ అయ్యారు. సమావేశంలో భాగంగా పలు అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా త్వరలోనే పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి ముగ్గురు కార్పొరేటర్లు చేరుతారనే టాక్ వినబడుతోంది.
ఇప్పటికే అవిశ్వాస తీర్మానానికి సంబంధించి మెజార్టీని కూడా కూటమి ప్రభుత్వం సాధించింది. అటు క్యాంప్ రాజకీయాలతో జీవీఎంసీ అవిశ్వాసం తీర్మానం ఆసక్తిగా మారనుంది. ఈ క్రమంలోనే నిన్న మండల అధ్యక్షులు, ప్రాథమిక పదవికి బెహరా భాస్కరరావు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు భాస్కరరావు ప్రకటించారు. ఇందు లో భాగంగా వైసీపీ అధినేత జగన్కి తన రాజీనామా లేఖను బెహరా భాస్కరరావు పంపించారు.