తెలంగాణ
KTR: రేవంత్ దిగజారి మాట్లాడుతున్నారు

KTR: రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైరయ్యారు. రేవంత్ దిగజారి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. భూమికి 3 ఫీట్లు ఉన్నోడు కూడా చాలా మాట్లాడుతున్నాడని అన్నారు. వాన పాములు కూడా ఇప్పుడు బుసలు కొడుతున్నారని ఆయన మండిపడ్డారు.
గ్రామ సింహాలు కూడా సింహాల్లా గర్జిస్తున్నాయని అన్నారు. ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ లేనిది తెలంగాణ లేదన్నారు. ఉద్యమ పార్టీగా దేశం చూపును ఆకర్షించామన్నారు. సూర్యాపేటలో పర్యటిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.