తెలంగాణ

Rangareddy: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Rangareddy: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బహదూర్‌పురా నుంచి అరాంఘర్ వెళ్లే కొత్త ఫ్లైఓవర్ మీద యాక్సిడెంట్ కావడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బైక్ స్కిడ్ అయ్యి డివైడర్‌ను ఢీకొట్టంది. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button