నారాయణగూడ చోరీ కేసును ఛేదించిన హైదరాబాద్ పోలీసులు

నారాయణగూడలో జరిగిన చోరీ కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. యజమాని ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా సీపీ సీవీ ఆనంద్ కుసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. దోపిడికి పాల్పడ్డవారు గతంలో మర్డర్ కేసులో నిందితులుగా ఉన్నారని తెలిపారు. వీరంతా కూడా బీహార్కు చెందిన వారని సీపీ తెలిపారు .కేడియా ఇంట్లో నమ్మకంగా పని చేస్తున్నట్టు నటిస్తూ కేడియా కుటుంబం దుబాయ్ వెళ్ళగానే సొత్తు మొత్తం దోచుకుని వెళ్లారన్నారు.
అయితే సీసీ ఫుటేజ్ల ద్వారా ట్రాక్ చేస్తే సికిందరాబాద్ ట్రైన్లో పారిపోయినట్టు గుర్తించామన్నారు. అప్పటికే భూపాల్, నాగ్పూర్, పాట్నా ప్రాంతాలకు తమ టీమ్స్ను పంపానమని….నిందితులు నాగ్పూర్ వెళ్లే సరికి అక్కడ వున్న తమ టీమ్స్ నిందితులను పట్టుకున్నామన్నారు. దొంగిలించిన సొమ్మును అంతా స్వాధీనం చేసుకున్నామని వాటి విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు ఐదు కోట్లకు పైనే ఉంటుందని సీపీ తెలిపారు.