తెలంగాణ
IPL 2025 Tickets: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ప్రారంభం

IPL 2025 Tickets: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. 2025 ఐపీఎల్ జోష్ ప్రారంభమైంది. ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ప్రారంభం అయ్యాయి. ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. అయితే ఫిజికల్ టికెట్స్ కోసం ఎల్బీ స్టేడియం, జింఖానా గ్రౌండ్స్, గచ్చిబౌలి స్టేడియంలో కౌంటర్స్ ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం హైదరాబాద్ లో ఏకంగా 9 మ్యాచులు జరగనున్నాయి.
ఈ నెల 23న హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ తలపడనుంది. సన్ రైజర్స్ గేమ్ ఉన్న తేదీల్లో జరిగే మ్యాచ్ లకు టికెట్లకు భారీ డిమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆరేంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కు పండగే అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో జరగనున్న 9 మ్యాచ్ ల్లో 7 లీగ్ మ్యాచ్ లతో పాటు 2 కీలక సెమీస్ మ్యాచ్ లు జరుగనున్నాయి.