ఆంధ్ర ప్రదేశ్
YCP: విద్యుత్ ఛార్జీల పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలు..

YCP: కూటమి సర్కారు ప్రజలపై అదనపు భారాన్ని మోపుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఏపీలో విద్యుత్ ఛార్జీలను పెంచి సామాన్యులను పెనుభారంగా మారిందని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది వైసీపీ.
సూపర్ సిక్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజలపై 15వేల కోట్ల అదనపు భారాన్ని వేయడం దారుణమని ..వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆపార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజాసంఘాలు నిరసనలకు దిగారు.