తెలంగాణ
Secunderabad: కోర్టులో విషాదం.. గుండెపోటుతో అడ్వకేట్ మృతి

Secunderabad: సికింద్రాబాద్లో విషాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ కోర్టులో గుండెపోటుతో మృతిచెందాడు ఓ అడ్వకేట్. కోర్టు ఆవరణలో ఉన్న బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తుండగా ఒక్కసారిగా హార్ట్ ఎటాక్కు గురయ్యాడు అడ్వకేట్ వెంకటరమణ. అయితే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించాడు. కాగా 25 సంవత్సరాలుగా సికింద్రాబాద్ కోర్టులో అడ్వకేట్గా విధులు నిర్వహిస్తున్నాడు వెంకటరమణ.