అంతర్జాతీయం
అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం

అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే అక్రమ వలసదారులతో ఒక విమానం ఇండియాకు చేరుకోగా.. ఇప్పుడు కాసేపట్లో భారత్కు మరో అక్రమ వలసదారుల విమానం చేరుకోనుంది. సీ-17 గ్లోబ్ మాస్టర్ 3 విమానం అమృత్సర్ చేరుకోనుంది.
ఇక అక్రమ వలసదారులతో కూడిన విమాన రాక కోసం అందరూ ఎదురు చూస్తున్నారని.. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఎక్స్లో పోస్టు చేశారు. అమెరికా నుంచి బహిష్కరణకు గురైన వారి చేతులకు.. సంకెళ్లు, పాదాలకు తాళ్లు కట్టి ఉంటాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ఇది భారత్ దౌత్యానికి ఓ పరీక్షగా మారనుందన్నారు చిదం బరం.