తెలంగాణ
Telangana: తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగి

Telangana: తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగిని ఇంటెలిజెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అనుమానంతో నిఘా పెట్టి ఫేక్ ఉద్యోగి భాస్కర్రావును పట్టుకున్నారు. రెవెన్యూ శాఖ ఉద్యోగిగా ఫేక్ ఐడీ కార్డుతో చెలామణి అవుతున్నారు భాస్కర్ రావు. అయితే.. అతని కదలికలు అనుమానం ఉండడంతో.. సీఎస్ఓ దేవిదాస్ ఆదేశాల మేరకు నిఘా పెట్టారు ఇంటెలిజెన్స్ సిబ్బంది.
ఈ క్రమంలో పూర్తి ఆధారాలు సేకరించి భాస్కర్ రావును పట్టుకున్నారు. అయితే.. అతనికి మైనార్టీ శాఖ సెక్షన్ ఆఫీసర్ డ్రైవర్ రవి.. ఫేక్ ఐడీ కార్డు తయారు చేసినట్లు గుర్తించారు అధికారులు. డ్రైవర్ రవిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.