తెలంగాణ
Harish Rao: వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై హరీష్రావు ఫైర్

Harish Rao: గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా దామరవంచ గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు ఆసుపత్రి పాలు కావడం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అంటూ ఎక్స్ వేదికగా విమర్శించారు.
ఏడాది కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు వందల్లో వెలుగుచూశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఫుడ్ పాయిజన్ కేసులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.