ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీ చరణి

తిరుమల శ్రీవారిని భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి దర్శించుకున్నారు. 2025 మహిళల క్రికెట్ వరల్డ్ కప్ లో భారత జట్టు ఘన విజయం సందర్భంగా ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం రాత్రి కాలినడకన తిరుమల చేరుకున్న శ్రీచరణి ఈ ఉదయం కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారికి తలనీలాలు సమర్పించి, స్వామివారి దర్శనం చేసుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీచరణికి వేదాశీర్వచనం అందించి అర్చకులు అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.



