జాతియం
PM Modi: విమాన ప్రమాదంపై మోదీ సమీక్ష

PM Modi: అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్, DGCA అధికారులతో భేటీ అయ్యారు. ఇప్పటికే ప్రమాద స్థలాన్ని పరిశీలించిన NSG టీమ్ విమానంలోని కీలకమైన బ్లాక్బాక్స్ను రికవరీ చేసింది. ఈ బ్లాక్బాక్స్ను DGCAకు NSG బృందం అప్పగించనుంది. ఇక బ్లాక్బాక్స్ డేటాను విశ్లేషించిన తర్వాత ప్రమాదానికి గల కారణాలను DGCA వెల్లడించనుంది.