తెలంగాణ
Revanth Reddy: నేడు సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

Revanth Reddy: నేడు సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 494 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. బసవేశ్వర విగ్రహావిష్కరణతోపాటు కేంద్రీయ విద్యాలయం ప్రారంభించనున్నారు రేవంత్.
అనంతరం పస్తాపూర్లో సీఎం రేవంత్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం ఢిల్లీకి బయల్దేరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు నీతిఆయోగ్ సమావేశానికి హాజరుకానున్నారు.