ఆంధ్ర ప్రదేశ్
Tirumala: పోలీసు కస్టడీకి కల్తీ నెయ్యి నిందితులు

Tirumala: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు నిందితులను విచారించనున్నారు. ఇందులో భాగంగా వైద్య పరీక్షల నిమిత్తం జైలు నుంచి రుయా ఆసుపత్రికి నలుగురు నిందితులను తరలించారు.
అనంతరం కస్టడీలోని పలు అంశాలపై వివరాలను రాబట్టనున్నారు. కస్టడీలో భోలేబాబా డెయిరీ మాజీ డైరెక్టర్లు వివేక్ జైన్, పోమిల్ జైన్పై ప్రశ్నల వర్షం కురిపించనున్నారు.