తెలంగాణ
Madhavaram Krishna Rao: తప్పుడు ప్రచారాలు చేసి సీఎం అయ్యారు

Madhavaram Krishna Rao: అబద్ధాల హామీలు ఇచ్చి తప్పుడు ప్రచారాలతో సీఎం అయ్యారని రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు . కూకట్ పల్లిలోని బాలానగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడు మధు ఆధ్వర్యంలో వందమంది యువకులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వాళ్లకి గులాబీ కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి స్వాగతించారు.
అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన 14 నెలల్లోనే నియోజకవర్గానికి మొండిచెయ్యే చూపిందన్నారు. తప్పుడు వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయన్నారు.